సారథి న్యూస్, మహబూబ్నగర్: అలంపూర్ పట్టణంలో జనవరి 13, 14 తేదీల్లో నిర్వహించే స్వేరోస్ సంబరాల పోస్టర్లను ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్, సీనియర్ స్వేరో కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, తోకల కృష్ణయ్య, హరినాథ్ సమక్షంలో నేహా షైన్ హాస్పిటల్ ఎండీ విజయ్ కాంత్ చేతులమీదుగా గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో సర్కిల్ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగరాజ్, మహబూబ్నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశపరీక్ష (టీటీడబ్ల్యూఆర్జేసీ) ఫలితాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విడుదల చేశారు. రిజల్ట్ను TGGURKULAM లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపిస్తామని చెప్పారు. ప్రవేశ ప్రక్రియ తేదీలు త్వరలోనే ప్రటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 73 గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో 7,040 సీట్లు ఉండగా.. వీటిలో ప్రవేశాలకు మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.