సారథి న్యూస్, హైదరాబాద్: పెరుగుతున్న జనాభా, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సోమవారం సనత్ నగర్ లోని పీసీబీ ఆఫీసులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కోవిడ్ -19 బయోమెడికల్ వేస్టేజీ నిర్వహణపై చర్చించారు. ఆస్పత్రుల్లో జీవవ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్న కంపెనీలకు నోటీసులు జారీచేసి, […]