సారథి న్యూస్, బిజినేపల్లి: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని ఆయన చాంబర్లో కలిశారు. బిజినేపల్లి గురుకులాన్ని వనపర్తి జిల్లా కేంద్రానికి తరలించవద్దని కోరారు. ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూలులో తరగతి గదులతో పాటు టాయిలెట్స్, డైనింగ్ హాల్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ పనులు పూర్తయ్యాయని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన మండలంలో విద్యావ్యవస్థ ప్రతిష్ట […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండడంతో స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. చదువుతున్న స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్కు ‘జ్ఞానదీక్ష’పేరుతో ‘దూరదర్శన్–యాదగిరి’ చానెల్ద్వారా ఆన్లైన్ పాఠాలు చెప్పనున్నారు. ప్రతిరోజు అరగంట పాటు(30 నిమిషాలు) మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు పాఠాలు ప్రసారం చేయనున్నారు. జులై 6 నుంచి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందిన సందర్భంగా గురుకులాల స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘జ్ఞానసమాజ నిర్మాణంలో మీ కృషి చాలా గొప్పది. మీరు మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలి.. జ్ఞానసమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలిగిద్దాం. మీ కలలను సాకారం చేస్తాం’ అని స్వాములు అన్నారు. ఆయన వెంట […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో చేరేందుకు ఇంటర్మీడియట్ సెకండియర్ స్టూడెంట్స్కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్సీఎస్)/బీఏ(హెచ్ఈపీఏ), బీకామ్(కంప్యూటర్), జూన్ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఎస్సీ(ఎన్డీజడ్సీ), […]
సారథి న్యూస్, హైదరాబాద్: సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో ఇంటర్మీడియట్, 6, 7, 8 తరగతుల్లో అడ్మిషన్ల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ కింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ.. కరోనా వైరస్ కట్టడి చర్యలపై గురువారం మాసాబ్ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ […]
సారథి న్యూస్, మహబూబ్నగర్: స్వేరోస్ సేవాగుణం చాటుకున్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్వేరోస్ అనుబంధ సంస్థ అయిన ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు, తెలంగాణ గురుకులాల క్రీడల అధికారి ఎం.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్ లో పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ఫూర్తితో తమవంతు సేవ చేస్తున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బాలనర్సిములు, […]