Breaking News

పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి
  • ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి
  • ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌

సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా వైరస్‌ మొదటి వేవ్‌లో కూడా మనం విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆలస్యం చేశామని, చాలా అంతర్జాతీయ విమానాలు ఢిల్లీలో దిగడం వల్ల నగరం ఎక్కువగా ప్రభావితమవుతోంది పీఎం సాబ్‌ దయచేసి విమానాలను ఆపండని అంటూ కేజీవ్రాల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఒమైక్రాన్‌ కరోనా కొత్త వేరియెంట్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కేజీవ్రాల్‌ ఆదేశించారు.