Breaking News

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉంది
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా చూద్దామని చెప్పారు. మతతత్వ పార్టీల నుంచి మన పల్లెలను ప్రశాంతంగా ఉంచుకుందామన్నారు. మనందరికీ అందుబాటులో ఉండే ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.