కన్నడ యువనటుడు సుశీల్గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని అందరికి షాక్ ఇవ్వగా..తాజాగా మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని సినీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను […]
సారథి న్యూస్, అలంపూర్: నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి దిండిగల్ ఆనంద్ శర్మ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించేది ఒక […]
సారథి న్యూస్, అలంపూర్: ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను మూసివేస్తున్నట్లు అలంపూర్ ఆలయాల ఈవో ప్రేమ్కుమార్ పేర్కొన్నారు. అలంపూర్లో దర్గా ఉర్సు సందర్భంగా వారం రోజుల పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటే కొవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు నిరసనకు దిగాడు. ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తంచేశాడు. పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి సదరు నిరసనకారుడు ఎవరనే వివరాలను ఆరాతీస్తున్నారు. కాగా, పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్ట్యాగ్ ను […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి అయ్యే ఖర్చులను నిర్ధారిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250 గా నిర్ధారించారు. ఎన్ఐవీతో […]
సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో పోలీసులు తనిఖీ చేసి రూ. 16,400 విలువచేసే గట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపు యజమాని మోహన్ లాల్ ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో […]
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని యశ్వంత్పూర్ ఏరియాలోని ఓ గెస్ట్హౌస్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. ఆ గెస్ట్హౌస్పై రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న ఐదుగురు యువతులను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ రైడింగ్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. […]