న్యూఢిల్లీ: యువనేత హార్థిక్పటేల్ కు కాంగ్రెస్పార్టీ కీలకపదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. హార్థిక్ను గుజరాత్ పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్గా నియమించారు. 26 ఏండ్ల హార్థిక్పటేల్ పిన్న వయసులో రాజకీయరంగప్రవేశం చేశారు. గుజరాత్లోని బలమైన సామాజికవర్గమైన పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటం దేశరాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అప్పటివరకు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న పాటిదార్లు ఆపార్టీకి దూరమై హర్థిక్ వెంట నడిచారు. హార్థిక్కు కీలకపదవిని అప్పజెప్పి గుజరాత్లో బలపడేందుకు కాంగ్రెస్ పావులు […]
న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులసంఖ్య భారత్లో అంతకంతకూ పెరుగుతున్నది. కేవలం గత నాలుగు రోజుల్లేనే లక్షకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 8,49,553కు చేసింది. గత 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా శనివారం 2,80,151 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. రాజ్భవన్లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతమైన చర్చ నడుస్తోంది. భవనాల కూల్చివేతలతో రూ.వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ విపక్షాలు నెత్తినోరూ మొత్తుకుంటున్నాయి. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి మరో రూ.500 కోట్లు కావాలని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దీనిపై మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి మాటలేవీ సర్కారు చెవికెక్కడం లేదు సరికదా.. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎదురుదాడి చేయడాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.మంత్రులు ఏమన్నారంటే..మంత్రులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న బాధితులకు ఇంటివద్దకే ‘ఐసొలేషన్ కిట్’ను సరఫరా చేయాలని నిర్ణయించింది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీ.. సంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తోంది. తమిళనాడులో పాగా వేసేందుకు చిరకాల కోరిక తీర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే తమిళ తలైవా.. రజనీకాంత్ను తన అండదండలు ఉంటాయని ప్రకటించింది. కానీ.. రజనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొదలైందట. అక్కడ పార్టీ పెట్టిన […]
సారథి న్యూస్, షాద్నగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ వద్ద బెంగళూరు హైవేపై ఆదివారం ఉదయం ఓ కంటెయినర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కన పార్క్ చేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ పొలీసులు ఫైర్ సిబ్బందిని అలర్ట్చేసి మంటలను ఆర్పివేయించారు. బెంగళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబంధించిన ట్యాబ్లెట్ లోడుతో వస్తున్న కంటెయినర్శంషాబాద్ ఘాన్సిమియాగూడ వద్దకు రాగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 67 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెదక్ టౌన్ లోని ఫతేనగర్ లో మూడు, రాంనగర్ వీధిలో ఒకటి, కౌడిపల్లి మండలం కంచాన్ పల్లిలో ఒకటి, చేగుంట మండలం రాంపూర్ లో ఒకటి, కర్నాల్ పల్లిలో ఒకటి, చేగుంటలో ఒకటి, తూప్రాన్ మండలం ఘనపూర్ లో ఒకటి, పాపాన్నపేట మండలం ఎల్లాపూర్ […]