సారథి న్యూస్, మహబూబాబాద్: గృహమే కదా స్వర్గసీమ! అన్న పెద్దలమాటను ఆచరించి ప్రతిఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల బారినపడకుండా క్షేమంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిరిజన సంక్షేమ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లోని కిచెన్, హాల్, కిటికీలు, ఫ్రిజ్, ఆవరణలోని వరండాలను ఆమె శుభ్రంచేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో తాను కూడా […]
విచిత్రమైన ఆలోచనలతో ఎవరూ ఊహించని పనులు చేయడంలో ముందుండటం.. కాంట్రవర్సీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో శృంగార తార మియా మాల్కోవాతో ‘జీఎస్టీ’ తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈసారి ‘క్లైమాక్స్’ అంటూ మళ్ళీ ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ టీజర్ ఓ […]
ముంబై: కరోనా కేసులతో సతమతమవుతూ.. నిసర్గ తుపానుతో అతలాకుతలమైన ముంబై ప్రజలకు ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. శనివారం రాత్రి నుంచి చాలా చోట్ల దుర్వాసన వస్తుండటంతో జనమంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని చింబూర్, ఘట్కోపర్, కంజూర్మార్గ్, విక్రోలీ, పొవై, అంధేరీ, మన్కుర్ద్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వాసన వస్తోందని ప్రజలు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వాసన ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై […]
గుర్గావ్: దేశవ్యాప్తంగా రేపటి నుంచి మాల్స్, గుళ్లు ఓపెన్ అయినప్పటికీ హర్యానాలోని గుర్గావ్, ఫరిదాబాద్ జిల్లాల్లో మాత్రం పర్మిషన్ లేదని రాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ విజ్ ఆదివారం చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే హర్యానాలోని మిగతా ప్రాంతాల్లో ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ అయి దీనిపై డెసిషన్ తీసుకున్నామన్నారు. ఆన్లాక్ 1 కింద ఈ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్ ఇష్యూను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని ఫారెన్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. బోర్డర్ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ ప్రతినిధులు శనివారం చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ‘స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా బోర్డర్ ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి, ప్రశాంతత అవసరమని […]
భోపాల్: మనుషులు రోజు రోజుకు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. జాలి, దయలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ యజమానులైతే ట్రీట్మెంట్ పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఓ వృద్ధుడు హాస్పిటల్ లో బిల్లు కట్టలేదని అతడిని మంచానికి కట్టేశారు. ‘మా నాన్నను హాస్పిటల్లో చేర్చే సమయంలో రూ.5వేలు కట్టాం. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి రూ.11వేలు బిల్లు కట్టమని చెప్పారు. మా వద్ద […]
సారథి న్యూస్, షాద్నగర్: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనాపాలనా తండ్రికి భారంగా మారింది.. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డలను లాలించలేనని శిశువిహార్కు అప్పగించాడు. కన్నపేగు కలతచెంది బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన గణేశ్ 16ఏళ్ల క్రితం షాద్ నగర్ కు బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం […]
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఆగిపోయిన క్రీడా కలపాలన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రేక్షకులకు అనుమతించే ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నా.. వియత్నాం మాత్రం దీనికి అతీతంగా నిలిచింది. దేశవాళీ ఫుట్బాల్ లీగ్కు ప్రేక్షకులను అనుమతించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. హోచిమిన్ సిటీలో జరిగిన వీ–లీగ్ మ్యాచ్లకు అభిమానులు పోటెత్తారు. మూడు మ్యాచ్లకు దాదాపు 30వేల మంది హాజరయ్యారు. మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించారు. అయితే ఏ ఒక్కరు కూడా మాస్క్లు […]