ఈ వెబ్ సిరీస్ల ట్రెండ్ టాలీవుడ్లో బాగా ముదురుతోంది. సూపర్ స్టార్ సైతం దీని వైపు ఆసక్తిగా అడుగులు వేస్తున్నారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ డైరెక్షన్లో తాను నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను వెబ్ సినిమాగా నిర్మించాలని మహేష్ అనుకుంటున్నాడట. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాడని తాజా సమాచారం. కానీ బాక్సాఫీస్ బొనాంజాగా నిలిచిన ఈ సినిమాను జనాలు ఇప్పటికే థియేటర్లలో చూసేశారు. మరి వెబ్ సినిమాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారో లేదో […]
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట యూ ట్యూబ్లో సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తోంది. సంగీతప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్గా సరికొత్త రికార్డును సృష్టించింది. సుకుమార్ వద్ద ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై కన్నడ […]
రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో ఒక కీలకపాత్ర పోషిస్తోన్న ప్రియమణి (జూన్ 4) గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’లో ఆమె ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో బ్లాక్ డ్రెస్లో అడవి అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్వచ్ఛగా నవ్వుతూ కనిపిస్తున్నారు ప్రియమణి. విప్లవ నాయకురాలు కామ్రేడ్ భారతక్క పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తున్నట్లు ఆమె కనిపిస్తున్నారు. ‘మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ […]
న్యూఢిల్లీ: మనుషుల క్రూరమైన చర్యల వల్ల కొన్నిసార్లు విపరీతంగా బాధపడాల్సి వస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళలో జరిగిన ఏనుగు ఘనటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గర్భంతో ఉన్న ఏనుగు మరణం తనను కలిచివేస్తోందన్నాడు. ‘మూగజీవులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలు సరికావు. మనం సాయం చేయకపోయినా.. హానీ మాత్రం చేయొద్దు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కేరళలో జరిగింది సిగ్గుమాలిన చర్య అని రైనా అన్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై […]
లండన్: చాలా రోజుల తర్వాత మొదలవుతున్న ఫార్ములా వన్ విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా రేస్ లో పాల్గొనే డ్రైవర్ కు కరోనా వచ్చినా.. రేస్ మాత్రం ఆగదని ఎఫ్–1 సీఈవో ఛేజ్ క్యారీ స్పష్టం చేశారు. ‘మేం కచ్చితమైన ప్రణాళికలతో ఉన్నాం. రేస్ లో పాల్గొనే ఎవరికైనా కరోనా వచ్చినా టోర్నీ మాత్రం ఆగదు. రిజర్వ్ డ్రైవర్లతో ముందుకెళ్తాం. సోషల్ డెస్టిన్సింగ్ విషయంలోనూ కచ్చితమైన ప్రణాళికలు పాటిస్తాం. రక్షణ వలయంలోనే రేస్ ల […]
న్యూఢిల్లీ: కరోనా తర్వాత జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ కండీషన్స్ మారిపోనున్న నేపథ్యంలో.. కొత్త తరహా ప్రయోగాలు చేయాలని ఐసీసీ క్రికెట్ కమిటీ చీఫ్ అనిల్ కుంబ్లే అన్నాడు. అందులో భాగంగా బ్యాట్, బంతికి మధ్య సమతూకం వచ్చేలా పిచ్ ను తయారు చేసుకోవాలని సూచించాడు. దీనివల్ల బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మి వాడకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నాడు. ఉమ్మి వాడకపోవడం తాత్కాలికమే కాబట్టి.. బంతి మెరుపు కోసం మరే ఏ పదార్థాన్ని వాడే అవకాశం లేదన్నాడు. […]
సిడ్నీ: అందరూ టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని భావిస్తున్న తరుణంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కొత్త సలహా ఇచ్చాడు. కరోనాను పూర్తిగా కట్టడి చేసిన న్యూజిలాండ్ లో ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్లో 12 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. దీంతో జన సమూహాలు, బీచ్ లు, మాల్స్ ను తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్టేడియాలకు ప్రేక్షకులకు అనుమతి కూడా […]
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ లో ఎన్నో ఘనతలు సాధించిన తాను.. అర్జున అవార్డుకు ఎందుకు సరిపోనని స్టార్ షట్లర్ హెచ్ఎస్. ప్రణయ్ అన్నాడు. తనకంటే తక్కువ స్థాయి ప్లేయర్లను అవార్డుకు సిఫారసు చేసి, తనను పక్కనబెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించాడు. ‘ప్రతి ఏడాది జరిగే కథే మళ్లీ పునరావృతమైంది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్ లో పతకాలు సాధించిన నాకు అవార్డు తీసుకునే అర్హత లేదా? అసోసియేషన్ కనీసం సిఫారసు కూడా చేయదా? కెరీర్లో మేజర్ టోర్నీలు ఆడని ప్లేయర్లను […]