వైఎస్ జగన్ పాలనకు నేటితో ఏడాది పూర్తి అన్ని సామాజికవర్గాలకు బాసటగా సర్కారు విద్య, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యరంగాలకు పెద్దపీట దేశానికే ఆదర్శంగా ‘దిశ’ చట్టం రూపకల్పన టెండర్ల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సారథి న్యూస్, అనంతపురం: ‘జగన్ అనే నేను..’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి మే 30 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెన్నో సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టాలెక్కించారు. వినూత్న పథకాలతో కొత్త ఒరవడితో […]
లండన్: ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.196 కోట్ల ఆదాయంతో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 34 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈసారి కూడా భారత్ నుంచి విరాట్ మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. రూ.801 కోట్లతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టెన్నిస్ ప్లేయర్కు టాప్ ప్లేస్ దక్కడం ఇదే తొలిసారి. సాకర్ […]
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని బౌలర్గా ఎదిగిన టీమిండియా పేసర్ భువనేశ్వర్.. టెస్ట్ల్లోకి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో ఆడుతున్న వారంతా బాగా రాణిస్తున్నారని చెప్పాడు. దీంతో తన పునరాగమనం మరింత కష్టమవుతుందన్నాడు. అయినా కచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ‘టెస్ట్ల్లో ఆడాలని బలంగా కోరుకుంటున్నా. కానీ పునరాగమనం సులువు కాదని తెలుసు. అయినా ప్రయత్నించడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఇప్పుడున్న పేసర్ల చాలా బాగా ఆడుతున్నారు. వాళ్లను దాటి చోటు […]
న్యూఢిల్లీ: భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కిరణ్జిత్ కౌర్పై నాలుగేళ్ల నిషేధం వేటుపడింది. డోప్ పరీక్షలో విఫలమైనందుకు ప్రపంచ అథ్లెటిక్స్ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 15న కోల్కతాలో జరిగిన టాటా స్టీల్ 25 కి.మీ. రేస్ సందర్భంగా సేకరించిన కిరణ్జిత్ శాంపిల్స్లో నిషేధిత డ్రగ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆమెపై ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించారు. అదేనెల 17న సేకరించిన రెండో శాంపిల్ను … దోహాలోని వాడా ల్యాబ్లో […]
వచ్చే ఏడాదికి సిద్ధమన్న సీఏ మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగడం కష్టమే. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే మెగా ఈవెంట్ను వాయిదా వేయడం ఖాయమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ను నిర్వహించలేమని సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ సంకేతాలిచ్చాడు. కరోనా, ప్రయాణ నిషేధం వల్ల ఈ ఏడాది టోర్నీ జరగడం కష్టమేనని తేల్చేశాడు. ‘ఒకవేళ ధైర్యంగా ముందుకెళ్లినా.. టోర్నీ నిర్వహణలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఆక్లాండ్లో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ‘టోర్నీని విజయవంతం చేసేందుకు మేం కొత్త షెడ్యూల్ను […]
లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. […]
ఈసీబీ సన్నాహాలు లండన్: అంతర్జాతీయ క్రికెట్ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్ డోర్ ట్రైనింగ్ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ […]