![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/SULABHHFF.jpg?fit=729%2C412&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్ కాంప్లెక్స్ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్ తదితరులు ఉన్నారు.