Breaking News

సులభ్​ కాంప్లెక్స్​ కోసం వినతి

సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్​ కాంప్లెక్స్​ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్​ కాంప్లెక్స్​ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్​ తదితరులు ఉన్నారు.