Breaking News

రకుల్​ నోరు విప్పితే..

డ్రగ్స్​కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​ రేపు ( శుక్రవారం)
ఎన్​సీబీ ( నార్కోటిక్స్​ కంట్రల్​ బ్యూరో) మందుకు వెళ్లనున్నది. అయితే రకుల్ విచారణంలో ఎవరెవరరి పేర్లు చెబుతుందోనని టాలీవుడ్​లో టెన్షన్​ నెలకొన్నది. డ్రగ్స్​కేసులో రకుల్​ పేరు వచ్చాక పలు నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నాయి. రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో రకుల్ ప్రీత్​సింగ్​ పేరు ఉందంటూ ఇటీవల నేషనల్​ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రకుల్​ ఒక్కసారిగా మీడియాపై మండిపడింది. అనవసరంగా తన పేరును లాగుతున్నారని హెచ్చిరించింది. అయితే రియా చెప్పిన లిస్ట్​లో రకుల్​ పేరు కూడా ఉన్నదని ఎన్​సీబీ స్పష్టం చేయడంతో ఆమె బండారం బయటపడింది.

నోటీసులపైనా డ్రామాలు..!
విచారణకు హాజరుకావాలని రకుల్​కు ఎన్​సీబీ నోటీసులు జారీచేసింది. ఈ విషయంపై పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే రకుల్​ మాత్రం బుకాయించింది. ‘నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. నేను విచారణకు వెళ్లడం లేదు’ అని చెప్పింది. దీంతో ఎన్​సీబీ సీరియస్​ అయ్యింది. ఆమెకు నోటీసులు జారీచేశామని విచారణకు హాజరుకాకపోతే నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో రకుల్​ వెంటనే మాట మార్చింది. ‘నాకు నోటీసులు అందాయి. శుక్రవారం ఎన్​సీబీ ముందు హాజరుకాబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

రకుల్​ గుట్టు విప్పుతుందా?

శుక్రవారం ఎన్​సీబీ చేయబోయే విచారణ కీలకంగా మారింది. ఈ కేసులో రకుల్​పై ఎన్​సీబీ ప్రశ్నల వర్షం కురిపించనున్నట్టు సమాచారం. రకుల్​ ఎంతకాలం నుంచి డ్రగ్స్​ తీసుకుంటున్నది. డ్రగ్స్​ కేసులో ఆమె కేవలం బాధితురాలేనా.. లేక నిందితురాలా? ఇలా పలు కోణాల్లో ప్రశ్నించనున్నారు. అయితే మంబై నంచి కొరియర్లలో హైదరాబాద్​కు డ్రగ్స్​ సరఫరా అవుతున్నట్టు సమాచారం. అయితే రకుల్​ నిజంగా డ్రగ్స్​ తీసుకున్నారా? లేదా ఇంకెవరి కోసమైన డ్రగ్స్​ కొన్నారా? అన్న విషయం రేపటి విచారణలో తేలనున్నది. అయితే ఈ కేసులో రకుల్ నోరువిప్పితే మాత్రం టాలీవుడ్​లో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు భార్య నమ్రత పేరు డ్రగ్స్​ కేసులో వినిపించింది. ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయన్నదన్నది ఆసక్తికరంగా మారింది.