Breaking News

 మేయర్ సుడిగాలి పర్యటన

మేయర్ సుడిగాలి పర్యటన

సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం విసృతంగా పర్యటించారు. కాప్రా సర్కిల్ సాయిబాబా నగర్ కంటైన్​ మెంట్​ జోన్ లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డీసీ శైలజ, కార్పొరేటర్ స్వర్ణరాజ్ పాల్గొన్నారు.

కవాడిగూడలో డ్రైనేజీ పనుల పరిశీలన.. మేయర్ సుడిగాలి పర్యటన

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాపింగ్ పనులను పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రూ. 144 కోట్ల వ్యయంతో క్యాపింగ్ పనులు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అన్నపూర్ణ భోజన వసతిని కల్పించినట్లు మేయర్ తెలిపారు.  జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రజల సౌకర్యార్థం పది ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.