![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/VANGAVEETI-RADHAAAFF.jpg?fit=700%2C525&ssl=1)
అమరావతి: టీడీపీ నేత వంగవీటి రాధా.. బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాను కోరుకున్న టికెట్ ఇవ్వలేదని టీడీపీలో చేరారు. టీడీపీ సైతం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీతరఫున ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు, లోకేశ్బాబు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో సంప్రదింపులు జరిపారట. కాగా వైఎస్సార్కాంగ్రెస్ను కాదనుకున్న వంగవీటికి రాజకీయ భవిష్యత్ కనిపించడం లేదు.