Breaking News

బాలీవుడ్​పై కుట్ర.. జయాబచ్చన్​ ఫైర్​

బాలీవుడ్​పై డ్రగ్స్​పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్​ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్​కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్​ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్​నే నిందించడం సరికాదు. డ్రగ్స్​ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ అంశంపై భోజ్​పురి నటుడు, ఎంపీ రవికిషన్​ మాట్లాడారు. బాలీవుడ్​లో చాలమంది నటులు, నిర్మాతలు, దర్శకులు డ్రగ్స్​ తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో జయా స్పందించారు. సినిమా వాళ్లే ఇలా మాట్లాడితే ఎలా ? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ వాళ్లు డ్రగ్స్​ తీసుకుంటారంటూ సినిమా వాళ్లే మాట్లాడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు.