![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/BJPPPPFF.jpg?fit=700%2C301&ssl=1)
సారథిన్యూస్, గద్వాల: త్వరలో జరుగబోతున్న తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని.. పుష్కరఘాట్ల వద్ద మరమ్మతులు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అలంపూర్లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కేవలం అలంపూర్ ఒక్కచోటే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని.. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం పులికలు, వేణిసోంపురం, రాజోలి, తుమ్మిళ్ల, పుల్లూరు, అలంపూర్ వద్ద ఉన్న పుష్కరఘాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం బాగుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మెడికల్ తిరుమల రెడ్డి, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి పరశురాముడు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ, కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు అంజి, ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.