Breaking News

నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడికి గుండు

అమరావతి: బిగ్​బాస్​ఫేం, పవన్​కల్యాణ్​ అభిమాని, ‘పరాన్నజీవి’ దర్శకుడు నూతన్​ నాయుడు ఇంట్లో దళిత యువకుడు ఘోర అవమానానికి గురయ్యాడు. కర్రి శ్రీకాంత్​ అనే ఓ దళిత యువకుడు నూతన్ ​నాయుడు ఇంట్లో పనిచేస్తున్నాడు. నూతన్​ భార్య మధుప్రియ శ్రీకాంత్​పై దొంగతనం నేరం మోపడంతో అతడు పనికి రావడం లేదు. ఈ క్రమంలో నూతన్​ నాయుడు భార్య మధుప్రియ.. శ్రీకాంత్​ను తన ఇంటికి పిలిపించి అతడికి గుండు కొట్టించింది. కాగా ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు పెందుర్తి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నూతన్​ నాయుడు పవన్​కల్యాణ్​ వీరాభిమాని.. ఇటీవల రాంగోపాల్​వర్మపై పరాన్నజీవి అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. జనసేన నాయకులతో నూతన్​ సన్నిహితంగా ఉంటాడు. 2014లో కిరణ్​కుమార్​రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశాడు.