Breaking News

దీపికా.. సారా ఏం చెబుతారు? బాలీవుడ్​లో టెన్షన్​!

బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్​ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్​ డ్రగ్స్​కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్​ అగ్రహీరోల పేర్లు రివీల్​ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్​ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని సర్వతా ఆసక్తి నెలకొని ఉన్నది.

ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, మరో నటి రకుల్​ప్రీత్​ సింగ్ ఎన్​సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. అయితే దీపికా మేనేజర్​ కరిష్మా పలు కీలక ఆధారాలను ఎన్సీబీకి చెప్పినట్టు సమాచారం. ఇవాళ మరోసారి కరష్మా విచారణకు హాజరుకానున్నారు. దీపికాను కరిష్మాను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేపట్టనున్నారు. అయితే గోవాలో ఓ చిత్ర షూటింగ్​లో ఉన్న దీపికా విచారణ కోసం శుక్రవారం రాత్రి భర్త రణ్ వీర్ సింగ్‌తో కలిసి ముంబైకు వెళ్లింది. ఇక సారా అలీ ఖాన్ కూడా గోవాలో ఉండగా.. ఆమె తల్లి అమృతా సింగ్. సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్లతో కలిసి సాయంత్రం 5 గంటలకు ముంబై వెళ్లింది. అయితే ఇప్పుడు విచారణలో వీరు ఏం చెబుతారని అని తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది.