Breaking News

తెలంగాణలో 1,931 కరోనా కేసులు

తెలంగాణలో 1,931కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. అయితే మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 665 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,475 కేసుల నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒకేరోజు 293 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 1,780 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 22,736 ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ అర్బన్ 144, రంగారెడ్డి 124, మేడ్చల్ 71, పెద్దపల్లి 64, నల్లగొండ 84, సంగారెడ్డి 86, ఖమ్మం 73, కరీంనగర్ 89, ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 39, జగిత్యాల 52, జనగాం 59, జోగుళాంబ గద్వాల 56, కామారెడ్డి 39, మహబూబ్​నగర్​43, మహబూబాదాద్​34, మంచిర్యాల 45, రాజన్న సిరిసిల్ల 54, సిద్దిపేట 71, సూర్యాపేట 64, యాదాద్రి భువనగిరి 18, వికారాబాద్​19, నిర్మల్ 53, నిజామాబాద్​53, నల్లగొండ 84, నాగర్​కర్నూల్​53, ములుగు 29, జయశంకర్​భూపాలపల్లి 17 చొప్పున కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.