Breaking News

డ్రగ్స్​కేసులో రకుల్..!

బాలీవుడ్​లో సంచలనంగా మారిన డ్రగ్స్​ కేసులో నటి రకుల్​ ప్రీత్​సింగ్​ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సుశాంత్​ సింగ్​ కేసులో ఎన్​సీబీ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె డ్రగ్స్​కేసులో 25 మంది పేర్లు చెప్పినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 25 మందిలో రకుల్​ ప్రీత్​సింగ్​ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్​ నౌ ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సన్నిహితురాలు సైమోన్‌ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్టు టైమ్స్​నౌ పేర్కొన్నది. అయితే ఈ కేసులో మరికొందరు టాలీవుడ్​ ప్రముఖలు ఉన్నట్టు సమాచారం.