Breaking News

డ్రగ్స్​కేసుపై దివ్యవాణి షాకింగ్​ కామెంట్స్​

తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్య వాణి తెలంగాణ ప్రభుత్వం, డ్రగ్స్​ కేసుపై షాకింగ్ కామెంట్స్​ చేశారు. ‘గతంలో ఓ సారీ టాలీవుడ్​లో డ్రగ్స్​కేసు అంటూ హడావుడి చేశారు. ఈ కేసు ఎందుకు మరుగున పడింది. విచారణ ఎందుకు ఆగిపోయింది. అందులో ఎవరెవరు ఉన్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.. ‘సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యం. రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? రకుల్‌కే వరుస ఆఫర్లు వస్తుంటాయి. ప్రణీతను ఎందుకు పక్కనపెట్టారు. అవసరాల సినీరంగంలోని కొంతమంది ఎంతకైనా దిగజారుతారని పేర్కొన్నారు. దివ్యవాణి కామెంట్స్​ ప్రస్తుతం వైరల్​గా మారాయి.