Breaking News

కరోనా మరింత ఉధృతం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. యాక్టివ్ కేసులు 5,109 ఉన్నాయి. వ్యాధిబారినపడి 4,224 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 220కు చేరింది. కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 64, మేడ్చల్​ జిల్లా నుంచి 112, వరంగల్​ రూరల్​ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10చొప్పున కేసులు నమోదయ్యాయి.