Breaking News

కరోనాతో 13 మంది మృతి

కరోనాతో 13 మంది మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో గురువారం 2,092 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73,050 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,358 రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 36, హైదరాబాద్ 535, జగిత్యాల 28, జనగాం 26, భూపాలపల్లి 21, జోగుళాంబ గద్వాల 72, కామారెడ్డి 28, కరీంనగర్ 123 ఖమ్మం 64, మహబూబ్ నగర్ 48, మహబూబాబాద్ 16, మంచిర్యాల 43, మెదక్ 18, మేడ్చల్ 126, ములుగు 27, నాగర్ కర్నూల్ 22, నల్లగొండ 52, నారాయణపేట 6, నిర్మల్ 25, నిజామాబాద్ 91, పెద్దపల్లి 54, సిరిసిల్ల 83, రంగారెడ్డి 169, సంగారెడ్డి 101, సిద్దిపేట 20, సూర్యాపేట 34, వికారాబాద్ 9, వనపర్తి 34, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 128, యాదాద్రి 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్ ను విడుదల చేసింది.