Breaking News

కరంటోళ్ల నిర్లక్ష్యం.. ఒకరు బలి

సారథి న్యూస్, కంగ్టి(నారాయణఖేడ్): విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మెదక్​ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన హైమద్ షేక్(45) విద్యుత్ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం విద్యుత్​శాఖ విధుల్లో భాగంగా తడ్కల్​లోని ఓ పొలంలో విద్యుత్​ వైర్లను బిగిస్తున్నాడు. కానీ విద్యుత్​ సిబ్బంది, అధికారుల సమన్వయ లోపంతో ఆ సమయంలో విద్యుత్​ సిబ్బంది కరెంట్​ వేశారు. దీంతో హైమద్​ విద్యుత్​ షాక్​తో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే హైమద్​ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.