Breaking News

ఒకేరోజు 2,256 కరోనా కేసులు

ఒకేరోజు 2,226 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 77,513 పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి 14 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు చనిపోయిన వారిసంఖ్య 615కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 22,568 వరకు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 464 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​26, భద్రాద్రికొత్తగూడెం 79, జగిత్యాల 49, భూపాలపల్లి 38, జోగుళాంబ గద్వాల 95, కామారెడ్డి 76, కరీంనగర్​101, ఖమ్మం 69, మహబూబ్​నగర్ ​45, మహబూబాబాద్ ​23, మంచిర్యాల 44, నల్లగొండ 61, నిజామాబాద్ ​74, పెద్దపల్లి 84, రంగారెడ్డి 181, వరంగల్​ అర్బన్ ​జిల్లా 187, యాదాద్రి భువనగిరి 24 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్​ను విడుదల చేసింది.