Breaking News

ఐటీ కంపెనీలను విస్తరించాలి

ఐటీ కంపెనీలను విస్తరించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్కషన్(గ్రేడ్) లో భాగంగా ఐటీ కంపెనీల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం సమావేశమయ్యారు. ఐటీ అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మెట్రోరైలు, శిల్పారామం, మూసీనది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సామాజిక వసతులు పెరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే నగరం ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయని అన్నారు. సమావేశంలో మున్సిపల్​ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.