Breaking News

ఈ దొంగ చాలా రిచ్ గురు!

సారథిన్యూస్​, హైదరాబాద్​: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్​స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్​ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది మాత్రం హైటెక్ దొంగ. ఇతగాడు కేవలం ఫ్లైట్​లోనే ప్రయాణాలు సాగిస్తుంటాడు. నేరుగా స్పాట్​కు చేరుకుంటాడు. అనంతరం పనిపూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ హైటెక్​ దొంగ గురించి సైబరాబాద్​ కమిషనర్​ సజ్జనార్​ తెలిపారు. ​ ఛత్తీస్​గఢ్​కు చెందిన గంగాధర్​ నొయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ ప్రైవేట్​ కంపెనీలో పని చేస్తాడు. అయితే అతడు కొంతకాలంగా ఈజీమనికి అలవాటు పడ్డాడు. అందులో భాగంగా హైదరాబాద్​లోని నిర్మానుష్య ప్రదేశాల్లోని ఇండ్లను దోచుకోవాలని ఫిక్స్​ అయ్యాడు. ప్లాన్​ ప్రకారం హైదరాబాద్​లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను ముందే ఎంపిక చేసుకుంటాడు. అనంతరం నొయిడా నుంచి హైదరాబాద్​కు ఫ్లైట్​లో వస్తాడు. నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్​లో వెళ్లిపోయి.. తాళం వేసిన ఇంటిని కొల్లగొడతాడు. అనంతరం డబ్బు, నగలు తీసుకొని మళ్లీ ఫ్లైట్​లో నొయిడాకు చెక్కేస్తాడు. కాగా ఇటీవల అతడిని సైబరాబాద్​ పోలీసులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 40 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు.