Breaking News

అపెక్స్​ మీటింగ్​ వాయిదా

సారథిమీడియా, హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25 న ఏర్పాటు చేయాలనుకున్న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కేంద్రం ఈ నెల 25 వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖలు పంపింది. అయితే ఇటీవల కేంద్రజలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​కు కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందతున్నారు. ఈక్రమంలో సమావేశాన్ని వాయిదా వేశారు.