Breaking News

రైతన్నల ఆక్రందనలు వినిపించవా?

సారథి న్యూస్​, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ ఎంపీపీ అశోక్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్​ గోపాల్ రెడ్డి, నేతాజీ గౌడ్ పచర్ల కుమార్, జగన్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.