- అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
- సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్హరిచందన్ పేరుతో ప్రకటన జారీచేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్లీవ్ పిటిషన్లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.