![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/DUBBAKAAAFF.jpg?fit=700%2C277&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా నిజాంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.