![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/SURVEYYYFF.jpg?fit=700%2C316&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల సర్వే తీరును జేసీ శ్యాంప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనగర్ గ్రామాన్ని సందర్శించి సర్వే జరుగుతున్న తీరును గురించి తెలుసుకున్నారు. ఆస్తుల నమోదు వివరాలను గురించి క్షత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు డీపీవో గ్రామాన్ని సందర్శించి సర్వేను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో మల్హోత్ర తదితరులు ఉన్నారు.