Breaking News

అందరికీ ఓటుహక్కు ఉండొద్దు..!

సారథి మీడియా, హైదరాబాద్​: అర్జున్​రెడ్డి ఫేం విజయ్​దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అందరికీ ఓటుహక్కు ఉండొద్దు. లిక్కర్​ మందు తీసుకొని ఓటేసేవారికి అస్సలు ఉండొద్దు. ధనవంతులకు, నిరుపేదలకు కూడా ఓటుహక్కు ఉండొద్దు. కేవలం మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఓటువేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకొనే హక్కుఉండాలి’ అంటూ సంచలన కామెంట్స్​ చేశాడు.

ప్రస్తుతం విజయ్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రౌడీ హీరోగా యూత్​లో మంచి ఫాలోయింగ్​ ఉన్న విజయ్ దేవరకొండకు వ్యాఖ్యలపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయ్ వ్యాఖ్యలు నియంతృత్వాన్ని సమర్థించే విధంగా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు అతడికి అండగా నిలుస్తున్నారు.