Breaking News

మునుగోడులో కాంగ్రెస్ జెండానే ఎగరేస్తం

మునుగోడులో కాంగ్రెస్ జెండానే ఎగరేస్తం

సామాజిక సారథి, రంగారెడ్డి: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్స్ జెండానే ఎగరబోతుందని కాంగ్రెస్స్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.  బుధవారం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చారకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిసి ప్రచారంలో పాల్గొన్న గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాడు అభివృద్ది కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ది శూన్యమని, వ్యక్తిగత స్వలాభం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. ప్రజలు ఓటుతో రాజగోపాల్ రెడ్డి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలను ప్రజలు స్వాగతించోధని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.