సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని బుజరనోపల్లి గ్రామానికి చెందిన దాదాపు 100 మంది కుటుంబాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీని శుక్రవారం వీడారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం కల్హేర్ మండలం ఖానాపూర్లో ఎమ్మెల్యే నివాసంలో బుజరానోపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. […]