Breaking News

మాచారెడ్డి

ఉరివేసుకుని జంట ఆత్మహత్య

సారథి న్యూస్​, నిజామాబాద్​: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్​ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More