Breaking News

VIMALASHATHAKAM

‘విమల శతకం’ ఆవిష్కరణ

‘విమల శతకం’ ఆవిష్కరణ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట గవర్నమెంట్​ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయులు శంకరయ్య రాసిన ‘విమల శతకం’ పుస్తకాన్ని బుధవారం డీఈవో రమేష్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 పద్యాలు నైతిక విలువలకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. యువతను చైతన్యపరచడం, కుటుంబక్షేమం.. వంటి అనేక విషయాలను ఇందులో రాయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్​ఎం పోమ్యానాయక్, సెక్టోరియల్ ఆఫీసర్ సుభాష్, నాగేశ్వర్ నాయక్, టీచర్లు రఘునాథ్​, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

Read More