సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశానికి ఆగస్టు 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కవిత, ఎగ్జామ్ ఇన్చార్జ్ వి.భాస్కరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in అనే వెబ్సైట్ నుంచి హాల్టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 26 కేంద్రాల్లో ఎగ్జామ్నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశపరీక్ష రాసేందుకు 4,151 మంది విద్యార్థులు దరఖాస్తు […]