Breaking News

UVCREATIONS

వెబ్​సిరీస్​కు ప్రభాస్​ ఫ్రెండ్స్​ ప్లాన్​

కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వెబ్​సిరీస్​లు నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మిత్రబృందం.. యూవీ క్రియేషన్స్​ సంస్థ ఆ వెబ్​సిరీస్​ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పూరి జగన్నాథ్, సుజిత్ వంటి స్టార్​ డైరెక్టర్లను ఈ సంస్థ సంప్రదించిందట. చాలా మంది యువహీరోలు కూడా వీరి వెబ్​ సిరీస్​లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.

Read More