చెన్నై: తమిళనాడులోని ట్యుటికోరన్ జిల్లాలో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్ మరణాల కేసులో సీబీసీఐడీ పోలీసులు గురువారం మరో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. ఇన్ స్పెక్టర్ శ్రీధర్, మరో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్ను అరెస్టు చేయగా.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేశారని తెలసిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున బయటికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు […]