పత్రికల పేర్లు చెప్పి డబ్బులు వసూలు యాత్రల పేరుతో జల్సాలు సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పలు దినపత్రికల పేరు చెప్పి పదిరోజుల నుంచి యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురిపై రెండు రోజులుగా మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు’గా పిలువబడేవారు ఏటా రెండుసార్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓ కారు తీసుకుని తెల్లవారింది మొదలు గ్రామాలపై పడి బెల్టుషాపులు, ఇసుక వ్యాపారులు, ఫర్టిలైజర్దుకాణాలు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హుస్సేన్సాగర్లో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటుచేసిన క్రూయిజ్ బోట్ను టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్అలీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే హుస్సేన్సాగర్లో కదిలే రెస్టారెంట్ బోట్ అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే దుర్గంచెరువులోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రతి డ్యాం వద్ద బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గోవా నిపుణుల సహాయంతో రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి […]
న్యూఢిల్లీ: ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తాజ్మహల్ మళ్లీ జనకళను సంతరించుకోనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి (17న)లో లాక్డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేతలో భాగంగా.. తాజ్మహల్కూ గేట్లు వేసిన విషయం తెలిసిందే. ఆరునెలల తర్వాత సోమవారం తాజ్మహల్లో పర్యాటకులను అనుమతించారు. అలాగే ఆగ్రా కోటనూ సందర్శించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్మహల్లో రోజుకు 5 వేల మందిని (మధ్యాహ్నం 2.30 వరకు 2,500.. తర్వాత మిగిలినవాళ్లు) ఆగ్రా కోటలో రోజుకు […]
సారథి న్యూస్, యాదాద్రి: యాదాద్రి ఆంజనేయ, నరసింహ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. అటవీశాఖ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు […]