Breaking News

THARMALSCREENING

థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి

సారథి న్యూస్​, హుస్నాబాద్: పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఏసీపీ మహేందర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం పలువురికి థర్మల్​ స్ర్కీనింగ్​ పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, గ్లౌస్​లు, మాస్కులు కట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే నాన్ కాంటాక్ట్ ఈ చలాన్​ ద్వారా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More