సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయమంతా సీఎం కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. కరోనా కాలంలో సీఎం కనిపించడం లేదంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విపక్ష కార్యకర్తలు, నేతలు సీఎం కనిపించడం లేదంటూ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా పెట్టారు. కేసీఆర్.. తెలంగాణలో రాజకీయం ఏదైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక.. ఏం చేస్తాడనేది కూడా ఆసక్తిగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడ ఉన్న ఆలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఎత్తైన భవనాలను కూల్చివేసే […]
సారథి న్యూస్, హైదరాబాద్: 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 21కోట్ల మంది కరోనాబారిన పడతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020 ఆగస్టు 15కు కరోనా వ్యాక్సిన్ తెస్తామంటోంది భారత ప్రభుత్వం. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించేందుకు అవకాశాలను కొట్టిపారేయలేమంటుంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సర్కారు రోజురోజుకూ వైద్యపరీక్షలు పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని పరీక్షించింది. మరి.. తెలంగాణలో 28వేల మందికి వైరస్ సోకింది. 16వేల మంది డిశ్చార్జ్అయ్యారు. 12వేల మంది ఆస్పత్రుల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గడం లేదు. తాజాగా గురువారం 1,410 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు 30,945కు చేరాయి. తాజాగా ఏడుగురు మృతి, ఇప్పటి వరకు 331 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్జిల్లాలో 34 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,40,755 కరోనా పరీక్షలు నిర్వహించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు నిరసనకు దిగాడు. ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తంచేశాడు. పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి సదరు నిరసనకారుడు ఎవరనే వివరాలను ఆరాతీస్తున్నారు. కాగా, పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్ట్యాగ్ ను […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,536 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 992 మంది డిశ్చార్జ్కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. తాజాగా 11 మందితో కలిపి మొత్తంగా 324 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇప్పటివరకు 1,34,801 టెస్టులు చేశారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో […]
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య 7,2,417కి చేరింది. 482 మంది చనిపోవడంతో వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 20,642కు చేరింది. ఇప్పటివరకు 4,56,831 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారని, రికవరీ రేటు 61.53శాతం ఉందని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. పాజిటివ్ టెస్టింగ్ రేట్ 8.66 శాతం ఉందని అన్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో […]
సారథిన్యూస్, హైదరాబాద్: నయా గద్దర్, తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు సుద్దాల నిస్సార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరుపేదల ముస్లిం కుటుంబంలో జన్మించిన నిస్సార్.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా నిస్సార్ వ్యవహరించారు. నిస్సార్ మృతికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఆర్టీసీ యూనియన్ నేత రాజిరెడ్డి, సీపీఐ నాయకుడు […]