సారథి, బిజినేపల్లి: ఉపాధిహామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలను కులాల వారీగా విభజించి పనులు చేయించడం సరికాదని, సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్)జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పనుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్నిధులను ఖర్చుచేయడం సరికాదన్నారు. గురువారం బిజినేపల్లి తహసీల్దార్ ఆఫీసు ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005లో నాటి ప్రభుత్వం కులాలు, మతాలకతీతంగా […]