సారథి, జగిత్యాల రూరల్: లాక్ డౌన్ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనిఉంటే 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
సారథి న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా హనుమంతుని పేట, ముత్తారం గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10లక్షల వ్యయంతో రెండు కి.మీ. మేర ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఎంపీడీవో రాజు, సర్పంచ్ ఎద్దు కుమార్, సదయ్య పాల్గొన్నారు.