సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,207 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా బారినపడి 53,239మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,412యాక్టివ్ కేసులున్నాయి. 24గంటల్లో 12మంది కోవిడ్19 వైరస్ కాటుకు బలయ్యారు. దీంతో రాష్ర్టంలో కరోనా వైరస్తో చనిపోయిన వారిసంఖ్య 601కు చేరింది. నిన్న మొత్తం 21,417శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 5,66,984కు చేరుకుంది.