శ్రీనగర్: పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం ఆందోళనలు జరిగాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్లో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. ‘సేవ్ రివర్స్, సేవ్ జమ్మూ’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపైన్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ఏ ప్రాతిపదికన చేసుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. ఈ విషయంలో రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. […]