Breaking News

prc

పీఆర్సీ హామీని అమలు చేయండి

పీఆర్సీ హామీ అమలు చేయండి

సారథి, బిజినేపల్లి: మండలంలోని వట్టెం గ్రామంలో పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్​జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్ సీలో చోటు కల్పిస్తున్నామని చెప్పిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు పథకంలో పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిజినేపల్లి మండలాధ్యక్షుడు జిల్లెల రామకృష్ణ, పరుశరాములు, లక్ష్మయ్య, మల్లయ్య, ఎల్లమ్మ పాల్గొన్నారు.

Read More
మున్సిపల్ సిబ్బందికి పీఆర్సీ వేతనం చెల్లించాలి

మున్సిపల్ సిబ్బందికి పీఆర్సీ వేతనం చెల్లించాలి

సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్​చేస్తూ బుధవారం నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మున్సిపల్ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శివవర్మ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది కృషి మరువలేనిదని కొనియాడారు. పెంచిన వేతనాలను జూన్ నుంచి అమలు చేయాలని డిమాండ్​చేశారు. మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రిషన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, […]

Read More