సారథి న్యూస్, వెల్దండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్న రైతు వేదికల నిర్మాణానికి నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, కలెక్టర్ ఈ.శ్రీధర్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతు వేదిక పనులకు శంకుస్థాపన చేశారు. వీలైంత తొందరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించడంతో పాటు ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు […]