సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ తన సొంత ఖర్చు రూ.15లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న కిషన్ రావు, ఎస్సై భగవంతురెడ్డి, గోపాల్, హరిగోపాల్, బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: రైతు బజార్ లలో వినియోగదారులతో పాటు కూరగాయలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన రామయ్య బౌలి, న్యూటౌన్ రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీచేసి క్రయవిక్రయాలను పరిశీలించారు. విక్రయదారులు, కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లను కచ్చితంగా కట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మోహన్ […]